Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఢీల్లీ లో బిజీ బిజీగా చంద్రబాబు
posted on: Jul 10, 2015 4:02PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు జపాన్ పర్యటన అనంతరం నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు ఢిల్లీలో కేంద్రమంత్రులతో వరుస సమావేశాలతో బిజీబిజీ గా ఉన్నారు. ఉదయం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా విద్యుత్ కార్మికుల గురించి.. ఏపీకి చెందిన 1,253 మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రివీల్ చేసిందని దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని మాట్లాడినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్జవదేకర్తో సీఎం భేటీ అయ్యారు. ఏపీ రాజధాని నిర్మాణానికి అటవీభూములు ఇవ్వాలని సీఎం జవదేకర్ ను కోరినట్టు సమాచారం. తరువాత కేంద్రహోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్.. కేంద్రజలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో పలు అంశాలపై చర్చించనున్నారు. చంద్రబాబుతో పాటు సుజనాచౌదరి, అశోకగజపతిరాజు, ఏపీ ప్రభుత్వ అధికారి కంభంపాటి రామ్మెహన్ రావు, ఎంపీలు కేశీనేని నాని, కొనకళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.






