పేద కుటుంబానికి అత్యన్నత వైద్యం అందించాలి.. చంద్రబాబు
posted on: Jun 29, 2015 4:22PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైద్య సలహా మండలిపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి అత్యున్నత వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. అంతేకాక ప్రతి వైద్య కళాశాలలో వైఫై సౌకర్యం ఉండాలని.. వైద్య విద్యలో నాణ్యత ఉండాలని.. నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలని ఆదేశించారు. వైద్య కళాశాలలో పరిశోధనలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Latest YouTube Trending Video NEWS



.jpg)



