మధ్యలో కేసీఆర్ పెత్తనమేంటి... చంద్రబాబు

తెలంగాణ సీఎం పై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చాలా చేసిందని.. రోజు రోజుకి వారి ఆగడాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రతి చిన్న విషయానికి ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం వాదోపవాదలకు దిగుతుందని.. ఏదో ఒక విషయంలో గిల్లి కజ్జాలు పెట్టుకుంటుందని మండిపడ్డారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు దాని బాధ్యతలన్నీ గవర్నర్ వి మధ్యలో కేసీఆర్ పెత్తనమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని.. ఆవిషయం కేసీఆర్ మర్చిపోయినట్టున్నారు.. కాస్త గుర్తుంచుకుంటే మంచిదని ఎద్దేవ చేశారు. ఇప్పటి వరకూ మౌనంగా ఉన్నాం మా ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా చేస్తే ఊరుకునేది లేదని అన్నారు.