TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కార్యకర్తల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. చంద్రబాబు

Published on: Sat Jun 27, 2015 2:51PM

పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య ఉన్న సమన్వయం ఇంకా పెరగాలని.. కార్యకర్తల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పైవిధంగా తెలిపారు. ఎన్ని సమస్యలొచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మహానాడులో ఇచ్చిన హామీలను.. తీసుకున్న నిర్ణయాలకు కార్యచరణ ప్రణాళిక ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అశోకగజపతిరాజు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు, నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నారా లోకేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.