విమర్శించిన వారికి పట్టిసీమ ఓ సమాధానం.. చంద్రబాబు

posted on: Jun 18, 2015 6:37PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించారు. దీనిలో భాగంగానే పట్టిసీమ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఆగష్టులో ట్రయల్ రన్ నిర్వహిస్తామని.. అంతేకాక పట్టిసీమ పనులు వేగవంతం కావడానికి కెమెరాలు కూడా ఏర్పటు చేస్తామని తెలిపారు. మన ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు పట్టిసీమ ఒక సమాధానంగా నిలుస్తుందని అన్నారు. పట్టిసీమను అడ్డుకోవడానికి చాలా మంది ప్రయత్నించారని.. కానీ అడ్డుకోవడం ఎవరివల్ల కాలేదని అన్నారు. పట్టిసీమ వల్ల ముంపు తప్పుతుందని.. పట్టిసీమను చేపట్టిన ఉత్సాహంతోనే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తిచేసి చూపిస్తామని తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...