నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఏపీ సీఎం

posted on: Jun 2, 2015 10:46AM

ఆంధ్రరాష్ట్ర నవనిర్మాణ దీక్షలో ఆరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. విజయవాడలోని బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షా కార్యక్రమంలో తెదేపా నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని నాని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ నేత అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని చాలా దారుణంగా విడదీసి ప్రజలకు అన్యాయం చేశారని, అయినా ప్రజలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉందని అన్నారు. అంతేకాకుండా విభజన వల్ల విద్యార్ధులు తమ మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు కోల్పోయారన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...