Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక
posted on: Oct 18, 2025 9:45PM

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నవంబర్ 1 నుంచి డీఏ జమ చేస్తామని ఇందుకు నెలకు రూ.160 కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నా డీఏ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
పోలీసులకు ఈఎల్.. ఒక ఇన్స్టాల్ మెంట్ రూ.105 కోట్లు ఇస్తాం. మరో రూ.105 కోట్లు జనవరిలో ఇస్తాం. 60 రోజుల్లోపు ఉద్యోగుల హెల్త్కు సంబంధించిన వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్ పెండింగ్లో ఉందని సీఎం పేర్కొన్నారు .సీపీఎస్ అంశంపై చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదని స్ఫష్టం చేశారు. ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు



.webp)


