TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు  ప్రారంభం

Published on: Fri Mar 21, 2025 10:52AM

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.  ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు పరీక్షలు జరిగాయి.  పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విద్యార్థులను అనుమతించారు.  పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,09,403 మంది విద్యార్థులు రాయనున్నారు.  2, 650  పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వచ్చే నెల నాలుగో తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి.  పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు చాలామంది విద్యార్థులు సమీపంలోని దేవాలయాలకు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవడం కనిపించింది.  పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పహారా కాశారు.