Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చాక్లెట్ల లారీ చోరీ
posted on: Nov 25, 2014 3:50PM

మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి చెన్నైకి చాక్లెట్ల లోడ్తో వెళ్తున్న మినీ లారీని నెల్లూరు జిల్లా తడ మండలం పెరియపట్టు దగ్గర సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. చాక్లెట్ల లారీతోపాటు లారీ యజమాని, డ్రైవర్, క్లీనర్ని కూడా ఆ వ్యక్తులు తీసుకుపోయారు. రోడ్డు మీద వెళ్తున్న లారీని స్పార్కియో వాహనంలో వచ్చిన కొంతమంది వ్యక్తులు తాము వాణిజ్య పన్నుల అధికారులమంటూ ఆపారు. ఆ తర్వాత డ్రైవర్, క్లీనర్, లారీ యజమానిని బంధించి లారీని దొంగిలించారు. ఆ తర్వాత డ్రైవర్,క్లీనర్ని ఓ అటవీ ప్రాంతంలో వదిలేసి లారీని, దాని యజమానిని తీసుకుని దుండగులు వెళ్ళిపోయారు. డ్రైవర్, క్లీనర్ తడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






