అనురాధ హత్యకు నిరసనగా కుప్పం బంద్ కు పిలుపు

posted on: Nov 17, 2015 2:21PM


 

చిత్తూరు జిల్లా మేయర్ కటారి అనురాధ హత్యకు నిరసనగా కుప్పంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా అనురాధ భర్త కటారి మోహన్ బావమరిది చింటూ కార్యాలయంపై మోహన్ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు.. పలు వాహనాలను దగ్దం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రహదారులను మూసివేసి.. 144 సెక్షన్ ను అమలు చేశారు. కాగా మున్సిపల్ కార్యాలయంలో తన ఛాంబర్ లో ఉన్న అనురాధ, ఆమె భర్త మోహన్ పై దుండగులు కాల్పులు, కత్తులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అనురాధ మరణించగా.. మోహన్ ను ఆస్పత్రికి తరలించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...