భారత్ చైనాను మించిపోతుంది

 

ప్రపంచంలో జననాల రేటులో చైనా ముందున్న సంగతి తెలిసిందే. కాని ఇప్పుడు చైనా జననాల రేటు కంటే భారత్ జననాల రేటు ఎక్కువుందట. భారత్ లో పెరుగుతున్న జననాల రేటును పరిశీలిస్తే మన దేశ జనాభా చైనాను మించిపోయిందని, 2012 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 2028 నాటికి భారత్ జనాభా చైనా జనాభా కంటే ఎక్కువ అవుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి జెపీ నడ్డా వెల్లడించారు. భారత్ లో జనాభా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంత ప్రభావవంతంగా లేవని అన్నారు.