కారు బోల్తా.. చేవెళ్ల డీఎస్పీకి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డీఎస్పీ రంగారెడ్డి ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తండ్రి అంత్యక్రియలకు వెళ్లి తిరిగి డీఎస్సీ కార్యలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై భీమయ్యతో కలిసి వెళుతుండగా చేవెళ్ల మండలం అళ్లాడ వద్దకు వచ్చే సరికి వీరు వెళుతున్న కారుకి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీఎస్పీతో పాటు హోంగార్డుకి కూడా తీవ్రగాయాలయ్యాయి.