TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేపిస్టులపై చెన్నై హైకోర్టు సంచలన తీర్పు

Published on: Mon Oct 26, 2015 5:06PM

 

రేపిస్టులపై చెన్నై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని నపుంసకులుగా మార్చాలంటూ అత్యంత కఠినమైన తీర్పు ఇచ్చింది, చిన్నపిల్లలపై అత్యాచారాలు, అకృత్యాలకు పాల్పడేవారికి ఇదొక్కటే మందు అని, ఇలాంటి దారుణాలకు పాల్పడేవారిని లైంగికంగా పనికిరాకుండా చేయాలని న్యాయమూర్తి కృపాకరన్ అభిప్రాయపడ్డారు, ఇది ఆటవికంగా కనిపించొచ్చు కానీ, ఆటవిక చర్యలకు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు, సంప్రదాయ చట్టాల ప్రకారం ఇలాంటి కేసుల్లో దోషులకు సరైన శిక్షలు పడటం లేదని, కానీ చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారిని నపుంసకులుగా  మార్చాల్సిన అవసరముందన్నారు న్యాయమూర్తి కృపాకరన్