తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

 

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు-లారీ ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం సంభవించింది. వివరాల ప్రకారం.. కృష్ణగిరి సమీపంలోని మేలుమళై వద్ద 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, కారు, లారీ అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా... మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మృతుల్లో చిన్నారి సహా ఆరుగురు మహిళలు ఉన్నారు. 30 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కృష్ణగిరిలోని ప్రభుత్వాసుత్రికి తరలించారు. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.