TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బండ్ల గణేష్ చంపుతానన్నాడట.. కేసు...

Published on: Tue Sep 30, 2014 6:38AM

 

సినీ నిర్మాత బండ్ల గణేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. ‘గబ్బర్ సింగ్’ సినిమా హక్కులు ఇచ్చే విషయమై సినీ నిర్మాత బండ్ల గణేష్ తనను మోసం చేశారని ధర్మచరణ్ అనే ఫైనాన్సియర్ సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గణేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్‌సింగ్ చిత్రం ఆంధ్రా ఏరియా హక్కుల కోసం గుంటూరుకు చెందిన ఫైనాన్సియర్ ధర్మచరణ్ తులసీ 2011లో రూ.80 లక్షలను ఆ సినిమా నిర్మాత గణేశ్‌కు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే బండ్ల గణేష్ ఆ సినిమా హక్కులు ధర్మచరణ్‌కు కాకుండా మరొకరికి విక్రయించాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమా రైట్స్‌ను మరొకరికి విక్రయించినందున తన డబ్బులు తిరిగివ్వాలని బాధిత ఫైనాన్సియర్ ఎన్నిసార్లు అడిగినా బండ్ల గణేష్ ఎంతమాత్రం స్పందించలేదు. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వకపోగా తనను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆ ఫైనాన్షియర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దాంతో బండ్ల గణేష్ మీద పోలీసులు బండ్ల గణేష్ మీద ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న బండ్ల గణేష్ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది.