లోయలో పడిన బస్సు.. 15 మంది మృతి
posted on: May 5, 2016 11:37AM

ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్-బలరాంపూర్ మధ్య ఈ రోజు తెల్లవారు జామున ఓ ప్రైవేటు బస్సు లోయలోపడింది. బస్సు గడువా నుంచి రాయ్పూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని రాయ్పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.
Latest YouTube Trending Video NEWS




.jpg)


