కెసిఆర్ కు బాబు న్యూయర్ ఆఫర్

 

 

 

తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు కెసిఆర్ కి న్యూయర్ ఆఫర్ ఇచ్చారు. కెసిఆర్ ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే కోట్లు వస్తున్నాయి కాబట్టి రైతులందరి భూములు కెసిఆర్ తీసుకొని ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున రైతులకిచ్చి మిగితా 95 లక్షల రూపాయలు తీసుకోవాలని అన్నారు. ఈ విధంగా చేస్తే రాష్ట్రంలోని రైతులు బాగుపడతారని చెప్పారు.

 

తెలంగాణ ప్రాంతంలో రైతులంతా గిట్టుబాటు ధర లేక కష్టాలు పడుతుంటే..కెసిఆర్ మాత్రం లాభపడ్డానని చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. ఇదంతా నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకునే ప్రక్రియలో భాగమేనని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కేసీఆర్ తన ఫాంహౌజ్‌లో చేస్తోంది వ్యవసాయం కాదని, అవినీతి సాగేనని ఆరోపించారు. మరోవైపు వ్యవసాయం అంత లాభసాటి అయితే రాష్ట్రంలో రైతులెందుకు ఆత్మహత్య చేసుకుంటారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.