గడ్కరీతో చంద్రబాబు భేటీ
Published on: Tue Oct 8, 2024 12:16PM
ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీతో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్దిపై వీరిరువురు చర్చించారు. నిన్న ప్రధానితో సమావేశమైన చంద్రబాబు రాత్రి ఢిల్లీలోనే మకాం వేసి మంగళవారం నాడు గడ్కరీతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, హర్ దీప్ సింగ్ పూరీలతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు.


