ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ!
posted on: Oct 7, 2024 5:34PM

రెండు రోజుల ఢిల్లీ పర్యటన కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళగానే నేరుగా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం, రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్ శంకుస్థాపన, సెయిల్లో విశాఖ స్టీల్ విలీనం, వరద బాధితులను ఆదుకొనేందుకు కేంద్రం నుంచి సాయం... తదితర అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. విభజన హామీల కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
Latest YouTube Trending Video NEWS




(2).webp)





