మూడుసార్లు ఛాన్స్.. కలుసుకోని సీఎంలు

posted on: Jul 11, 2015 1:08PM

 

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు డుమ్మా కొట్టారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇద్దరు సీఎంలను ఆహ్వానించగా చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్న కారణంగా హాజరుకాలేకపోయారు. కేసీఆర్ హైదరాబాద్ లోనే ఉన్నా ఇఫ్తార్ విందులో పాల్గొనలేదు. అయితే ఓటు నోటు కేసు వ్యవహారం వల్ల రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి ఇద్దరు సీఎంలు కలుసుకోవడానికి ఇప్పటికి మూడుసార్లు అవకాశం వచ్చినా వారు మాత్రం కలుసుకోలేదు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణ విడిదిలో భాగంగా ఇక్కడకి రాగా అప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి చంద్రబాబు హాజరుకాలేదు. తరువాత ఆయన స్వయంగా రాష్ట్రపతి నిలయానికి వెళ్లి కలిశారు. తరువాత గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతికి విందు ఏర్పాటు చేయగా.. అప్పుడు కూడా గవర్నర్ ఇద్దరు సీఎంలను ఆహ్వానించారు. కానీ అప్పుడు చంద్రబాబు మాత్రమే విందుకు హాజరయ్యారు.. కేసీఆర్ కు జ్వరం కారణంగా హాజరుకాలేకపోయారు. అప్పుడు కూడా ఇద్దరు సీఎంలు ఒకరినొకరు కలవలేకపోయారు. ఇప్పుడు కూడా మూడోసారి కలిసే ఛాన్స్ వచ్చినా చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి హాజరుకాలేదు.. కేసీఆర్ కూడా హాజరుకాలేదు. అయితే ఈసారి గవర్నర్ విందుకు ఏకంగా ఇద్దరు సీఎంలు డుమ్మా కొట్టారు. అసలు వీరు యాదృశ్చికంగానే కలుసుకునే ఛాన్స్ రావట్లేదా.. లేకపోతే కావాలనే కలుసుకోవట్లేదా అనే సందేహాలు మొదలయ్యాయి అందరిలో.

google-ad-img
    Related Sigment News
    • Loading...