చంద్రబాబు ప్లాన్ ముందు జగన్ ప్లాన్ తుస్సే..!

రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్న రాజకీయానుభవం ముందు జగన్ రాజకీయానుభవం దిగదుడుపే. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అసలే రాజకీయ చాణుక్యుడిగా చంద్రబాబుకి పేరుంది. జగన్ జ‌గ‌న్‌కు అనుభ‌వం కంటే దూకుడు ఎక్కువ‌గా ఉండ‌డంతో చాలాసార్లు ఆయ‌న ఫెయిల్ అవుతూ వ‌స్తున్నారు. ఈసారి కూడా జగన్ కు అదే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏపీ శీతాకాల సమావేశాల్లో భాగంగా వైసీపీ పార్టీ నేతలు రాజ్యాంగంపై అంబేద్కర్ గురించి మాట్లాడనివ్వకుండా.. కాల్ మనీపై మాట్లాడాలని పట్టుబట్టారు. కానీ అధికార పార్టీ మాత్రం అంబేద్కర్ గురించి మాట్లాడాలని పట్టుబట్టింది. అయితే చంద్రబాబు ఎక్కడ కాల్ మనీ వ్యవహారం మ‌రుగున‌ప‌డేలా చేస్తారో అని ఆవేశపడిపోయి అంబేద్కర్ గురించి మాట్లాడకుండా మొదట కాల్ మనీ గురించే మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో ప్రతిపక్షం దళితులకు వ్యతిరేకం అన్న భావన కలిగించాలన్న వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేసింది. అంతేకాదు వైసీపీ నేతలు దళిత ఎమ్మెల్యేలతోనే ప్రతిపక్షంపై అధికార పక్షం పదేపదే దాడి చేయించింది. దీంతో వైసీపీ దళితులకు వ్యతిరేకం అనే సంకేతాలు బయటకు పంపేలా చేసింది. మొత్తానికి చంద్రబాబు వేసిన చిన్న ప్లాన్ ముందు.. జగన్ పెద్ద ప్లాన్ బెడిసికొట్టింది.