Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పుష్కరాలకు రండి.. సెల్ఫీలు పెట్టండి.. చంద్రబాబు
posted on: Jul 2, 2015 10:51AM

ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ లో గోదావరి నిత్యహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు తెలుగు ప్రజలకు చాలా ముఖ్యమైనవని, ఇది గోదావరి ప్రాంతానికి మాత్రమే చెందినవి కావని.. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికి చెందినవని అన్నారు. ఇకనుండి ప్రతిరోజు గోదావరి హారతిని నిర్వహిస్తామని అన్నారు. ఇంకా గోదావరి పుష్కరాలు 13 రోజుల్లో ప్రారంభమవుతాయని.. కుంభమేళా కన్నా గొప్పగా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని అన్నారు. అంతేకాదు గోదావరి పుష్కరాలు కుటుంబ సభ్యులతో వచ్చి పుణ్యస్నానాలు చేసి సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో ఉంచాలని, దీనికోసం ఒక వేదికను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. పుష్కరాలకు వచ్చిన వాళ్లు కూడా చెత్తాచెదారం ఎలా పడితే అలా పడేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెత్తకుండీలలో వేయాలని సూచించారు.


.jpg)
.jpg)


