ఆయనకీ నిద్రలో కూడా అవే ఆలోచనలట!

 

గత ఐదు నెలలుగా నిర్విరామంగా పాదయాత్రలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి నిద్రలోకూడా అవే ఆలోచనలని చెప్పారు. అంటే కాదు మెలుకువగా ఉన్నపుడు కూడా అవే ఆలోచనలుట! అపార్ధం చేసుకోవద్దు, ప్రజల సమస్యల గురించే ఆ ఆలోచనలుట.

 

మెలకువగా ఉన్న, నిద్రపోతున్నా ప్రజల సమస్యలే తన మెదడును ఆక్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. అందువల్ల ఈ సమస్యలన్నిటినీ ఒకేసారి పరిష్కరించి పడేసేందుకు అప్పుడే ఆయన  చాలా ప్రణాలికలు కూడా సిద్దం చేసుకోన్నానని ఇటీవల పాదాయత్రలో ప్రజలకు తెలిపారు. ఇక, ప్రజలు కూడా సిద్దమయితే వెంటనే అన్ని సమస్యలను తానూ చక చకా పరిష్కరించేయదలుచు కొన్నట్లు  చెప్పారు.

 

ఇదివరకు అధికారంలో ఉన్నపుడు ప్రజల మైండ్ సెట్ మారాలని చెపుతూ వచ్చిన చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టిన తరువాత ఇప్పుడు తన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఇప్పుడు తానూ మారిన మనిషినని ఆయన అన్నారు.

 

ఇక తన జీవితం సర్వస్వం ప్రజలకే అంకితం అని చెప్పారు. అసలు మన స్వంత బంధువులు, స్నేహితులే మన సమస్యలని పట్టించికోని ఈ రోజుల్లో మన మొహం కూడా ఎన్నడూ చూడని చంద్రబాబు ఈ విధంగా మన కోసం (?) పాపం రాత్రనకా, పగలనకా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక పాదయాత్రలు చేయడం, మన కోసమే ఆలోచించడం నిజంగా తెలుగు ప్రజల పూర్వ జన్మ సుకృతమేనేమో.