ట్రిబ్యునల్‌ తీర్పుపై బాబు ఆవేదన

 

కృష్ణా జలాల పంపిణ విషయంలో బ్రిజేష్‌కుమార్‌ కమిటీ ఇచ్చిన తీర్పులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని దిలీప్‌కుమార్ సేథ్, డీపీ దాస్‌లతో కూడిన ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.  శుక్రవారం సాయంత్రం ఆయన నివాసం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన ఆల్మట్టి ఎత్తు పెంపును ట్రిబ్యునల్ అంగీకరించడం దారుణమని అన్నారు. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచకుండా టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్డుకున్నామని తరువాత వైయస్‌ హయంలో మిగులు జలాలు రాష్ట్రానికి అవసరం లేదని లేఖ రాయడం వల్లే ఈ రోజు రాష్ట్రానికి ఇలాంటి దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.