ఒడిశా సీఎం కార్యాలయంలో అగ్నిప్రమాదం..

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఛాంబర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం అసెంబ్లీలోని నవీన్ కార్యాలయంలో ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఇది చిన్న ప్రమాదమేనని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మంటలు చేలరేగినట్టు చెప్పారు. ఓ టీవీ, ఫర్నిచర్ స్వల్పంగా దెబ్బతిన్నట్టు సమాచారం.