ఛలో అసెంబ్లీ.. ముట్టడి కట్టడి

posted on: Sep 30, 2015 4:13PM

వరంగల్ జిల్లా తాడ్వాయ్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో శృతి, విద్యాసాగర్ లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పలు సంఘాలు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై పలు విమర్శలు చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే ఈ పని చేసిందని.. 350 సంఘాలతో చలో అసెంబ్లీ చేపడతామని వామపక్షాలు తెలిపారు. దీనిలోభాగంగానే ఈరోజు వామపక్షాలు శృతి, విద్యాసాగర్ ఎన్‌కౌంటర్‌పై నిరసన వ్యక్తం చేస్తూ ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వామపక్షనేతలు.. కార్యకర్తలు.. ఇతర సంఘాల నేతలు పాల్గొననున్న నేపథ్యంలో పోలీసులు ముందే సమాచారం తెలుసుకొని అసెంబ్లీ వద్ద భారీ బందో బస్తు ఏర్పాటుచేశారు. అంతేకాదు నిరసనలో పాల్గోనే వారందరిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థినులను ఎన్‌సీసీ గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు..కొంతమందిని గృహనిర్భందం కూడా చేశారు. దీంతో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇంత బందోబస్తు ఏర్పాటుచేసినప్పటికీ రాజ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడ కలకలం రేగింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...