Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోలవరానికి కేంద్రం 2800 కోట్ల వరం!
posted on: Oct 8, 2024 12:35PM

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2800 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఏ పద్దు కింద ఈ నిధులు విడుదలయ్యాయన్న స్పష్టమైన సమాచారం లేదు. అయితే ప్రాజెక్టు అధికారులు మాత్రం పాత పాత బిల్లుల రీయింబర్స్మెంట్ కింద రూ. 800 కోట్లు, పనులు చేపట్టేందుకు అడ్వాన్సుగా రూ. 2000 కోట్లు కేంద్రం విడుదల చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ హయాంలో ఐదేళ్లుగా అతీగతీ లేనట్లుగా నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత పరుగులు తీస్తున్నాయి. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది.






