బిజెపి చేయలేని పని కాంగ్రెస్ చేసింది

posted on: Jul 19, 2023 3:39PM

ఆలయ పవిత్రతను కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 36 వేల  దేవాలయాల్లో మెబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా దైవ దర్శనం కోసం వచ్చే వారు ప్రశాంతత కోరుకుంటారు. కానీ దేవాయాల్లో మొబైల్ ఫోన్స్ మ్రోగితే భక్తుల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇంతకు మునుపు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయినప్పటికీ సెల్ ఫోన్లను నిషేదించలేకపోయింది. ఇటీవలె కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. అయినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం ఆలయ పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్లను నిషేదించి  అమలు చేయడం పలువురు హర్షం వెలిబుచ్చుతున్నారు. కర్ణాటక రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని వారి వాదన. 

google-ad-img
    Related Sigment News
    • Loading...