ఎస్.పి. త్యాగిపై ఆంక్షలు ... సిబీఐ

posted on: Mar 19, 2013 7:53AM

 

వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఎస్.పి.త్యాగి ఇటలీ సంస్థ అగస్తా వెస్ట్ ల్యాండ్ నుండి వివిఐపి హెలికాప్టర్ల కొనగోలు చేసేందుకు కుదుర్చుకున్న 3,600 కోట్ల రూపాయల ఒప్పందంలో ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఆయనతో సహా సహనిందుతులు భారతదేశం విడిచి వెళ్ళరాదని, ఒకవేళ వెళ్ళవలసివస్తే సిబీఐకి ముందుగా తెలియజేయాలని సిబీఐ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విదేశాలకు వెళ్ళవచ్చా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. హెలికాప్టర్ల కొనగోళ్ళ కుంభకోణంలోని వారు దేశం విడిచి వెళ్ళకుండా లుక్ ఔట్ సిబీఐ జారీ చేసిందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఆ వార్తలన్నీ ఊహాగానాలే తప్ప ఇప్పటివరకూ అటువంటి నోటీసులు ఏవీ జారీ చేయలేదని మీడియాకు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...