సబితా, ధర్మానను జైలుకు పంపాల్సిందే: సిబిఐ
posted on Jul 13, 2013 4:24PM
మీడియాతో మాట్లాడిన విషయాలపై దాఖలు చేసిన మెమోపై మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలను సిబిఐ వ్యతిరేకించింది. వారిద్దరు మంత్రులుగా పనిచేశారని, రాజకీ యంగాను, అధికార వర్గాల్లోనూ పలుకుబడి కలవారని ఈ నేపథ్యంలో వారు మాట్లాడిన మాటలు సాక్షుల్ని ప్రభావితం చేస్తాయన్న తన ఆందోళనను పునరుద్ఘాటించింది. ఈ వ్యవహారంలో నింధుతులుగా వీరిద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాలని, నేరం రుజువైతే శిక్ష అనుభవించక తప్పదని పేర్కొంది.
సీబీఐ దాఖలు చేసిన మెమోను కొట్టేయాలని కోర్టును మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితాకోరారు. ప్రజాప్రతినిధులుగా తాము ఎందుకు రాజీనామా చేశామో చెప్పాల్సిన బాధ్యత త మపై ఉందని అందుకే మీడియాతో మాట్లాడామని చెప్పారు. దానిపై సీబీఐ అర్థం లేని వాదనలను లేవనెత్తిందని ఆక్షేపిం చారు. దీనిపై వాదనలను కోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి ఈ వ్యవహారంలో సబిత, ధర్మానలకు జైలు జీవితం తప్పేలా కనబడటం లేదు.