Latest News
ఎమ్మెల్యే రేవంత్ మీద కేసు
posted on: Oct 21, 2014 7:22PM

తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఆశ్రిత పక్షపాత ధోరణితో తమ బంధువులకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక న్యాయవాది రేవంత్ రెడ్డి మీద నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.






