పవన్ కళ్యాణ్ VS తమిళ్ సాంబార్!
Published on: Sat Oct 5, 2024 2:41PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తమిళనాడులోని మధురైలో కేసు నమోదైంది. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో పవన్ తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిథి మారన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు మధురైలో కేసు నమోదైంది. వారాహి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని, అలా అనుకున్నవారే తుడిచిపెట్టుకుపోతారని వ్యాఖ్యానించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వంజినాథన్ అనే న్యాయవాది పవన్ కల్యాణ్పై మధురై కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తిరుపతి లడ్డూ వివాదానికి, ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పవన్ విమర్శలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


