కామ్రేడ్స్‌తో దోస్తీకి రెడీ: మమత

posted on: Aug 31, 2014 7:34PM

 

ఉత్తర ప్రదేశ్‌ ఉప ఎన్నికలలో లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, కాంగ్రెస్ దోస్తీ వర్కవుట్ కావడంతో ఇదే మార్గంలో వెళ్తే మంచిదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావిస్తున్నట్టున్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాను అడ్డుకునేందుకు వెస్ట్ బెంగాల్‌‍లో లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లోనూ.. ప్రజాస్వామ్యంలోనూ ఎవరూ అంటరానివారు కాదనీ, సీపీఎంతో పొత్తుకు తాము కూడా వ్యతిరేకం కాదని అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాము అన్ని తలుపులు తెరిచి ఉంచుకుంటామని, అవకాశం వచ్చినప్పుడు పొత్తు పెట్టుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అయితే, వామపక్ష పార్టీల నేతలు మాత్రం ఈ ప్రతిపాదనను నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...