Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భవనం కూలి 17 మంది మృతి
posted on: Nov 25, 2014 9:20PM

ఈజిప్టు దేశ రాజధాని నగరం కైరోలో ఒక భవనం కూలి 17 మంది మరణించారు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గతంలో నిర్మితమై ఉన్న మతారియా సుబుర్బ్ భవనానికి అదనంగా మరికొన్ని అంతస్తులను వేశారు. బరువు పెరిగిపోవడంతో ఈ భవనం కూలిపోయింది. రక్షణ దళాలు భవనం శిథిలాలను తొలగించే పనిలో ఉన్నాయి. ఈ విషయాన్ని కైరో పౌర రక్షణ విభాగం జనరల్ డైరెక్టర్ మామ్ దో అబ్దుల్ ఖాదిర్ తెలిపారు. ఈ పురాతన భవనం శిథిలావస్థకు చేరింది. పైగా దాని మీద మరికొన్ని అంతస్థులు కట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ భవనంలో నివాసం ఉన్న వారిని ఖాళీ చేయాలంటూ గతంలోనే అధికారులు ఆదేశించారు. అయినా వారు వినలేదు. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో వారిలో చాలామంది మరణించారు.






