ఉప ఎన్నికల కౌంటింగ్..దూసుకుపోతున్న కారు

posted on: Mar 21, 2012 11:46AM

హైదరాబాద్: ఉప ఎన్నికలు జరిగిన 7 నియోజకవర్గాల్లోనూ ఈ రోజు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా పోలీసులు అన్ని భద్రతా చర్యలూ చేపట్టారు.

ఓట్ల లెక్కింపు వివరాలు

* కామారెడ్డి : టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంపగోవర్థన్‌రెడ్డి 44,466 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
* ఆదిలాబాద్ : నాలుగో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న 20,365 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
* నాగర్ కర్నూల్ : ఏడో రౌండ్ ముగిసేసరికి స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్థన్‌రెడ్డి 17,779 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
* కొల్లాపూర్ : నాలుగో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 5,162 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
* స్టేషన్ ఘన్‌పూర్ : పదిహేడో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య 30,252 ఓట్ల మెజార్టీలో ముందంజలో ఉన్నారు.
* కోవూరు : తొమ్మిదో రౌండ్ ముగిసేసేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ 14,468 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
* మహబూబ్‌నగర్ : తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి ఇబ్రహిం 154 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
టీఆర్ఎస్ - 17,600 , బీజేపీ - 17,446 , కాంగ్రెస్ - 13,746 , టీడీపీ - 10,500

google-ad-img
    Related Sigment News
    • Loading...