పేలిపోయిన బస్సు... 35 మంది మృతి

 

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ లోని పన్నా నుండి ఛతర్‌పూర్‌ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు పన్నా జిల్లాలోని పండవి లోయ ప్రాంతంలో ఉన్న కల్వర్టును ఢీకొట్టి లోయలో పడిపోయింది. దీనివల్ల బస్సు డీజిల్ ట్యాంకు పగిలిపోయి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 35 మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మొత్తం ఎంతమంది చనిపోయారన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం మేజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించింది. మృతి చెందిన బాధితులకు నష్టపరిహారం ప్రకటించింది.