Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పెళ్ళి బస్సు బోల్తా... 30 మందికి గాయాలు
posted on: Nov 22, 2015 10:10AM

కడప జిల్లా ముద్దనూరు వద్ద ఆదివారం ఉదయం పెళ్ళి బృందం ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. పెద్ద ముడియం మండలం పెద్ద పసుపుల గ్రామం నుంచి 50 మంది ప్రయాణికులతో పులివెందులకు బయల్దేరిన పెళ్ళిబస్సు ముద్దనూరు సమీపంలోని ఎత్తులోకట్ట మలుపు వద్ద బోల్తా పడింది. మితిమీరిన వేగం కారణంగానే ఈ బస్సు బోల్తా పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం.






