టీజీపీఎస్ సి చైర్మన్ గా బుర్రావెంకటేశం
posted on: Nov 30, 2024 10:16AM
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషణ్ చైర్మన్ గా సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి బుర్రావెంకటేశం నియామకమయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం వచ్చేనెల 3 వ తేదీన ముగియనుంది. కొత్త చైర్మన్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 40 అప్లికేషన్లు వస్తే అందులో 20 వరకు స్వీకరించారు. వీరిలో బుర్రా వెంకటేశం పేరును ముఖ్యమంత్రి వెంకటేశం ఎంపిక చేశారు. ఈ ఫైల్ ను రాజ్ భవన్ కు పంపించగా ఆమోదముద్ర లభించింది.


.webp)
.webp)


