పెళ్ళి జరిగిన 14 రోజులకే...

 

కృష్ణా జిల్లా పెడన పట్టణంలో ఓ నవ వధువు పెళ్ళయిన పద్నాలుగు రోజులకే అనుమానాస్పద స్థితిలో మరణించింది. పెడన పట్టణానికి చెందిన ప్రకాశ్‌రావు కుమార్తె ధనలక్ష్మి (19) వివాహం ఈ నెల 11న జరిగింది. అయితే బుధవారం రాత్రి ధనలక్ష్మిగుండెపోటుతో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ధనలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే ధనలక్ష్మి అనుమాస్పద స్థితిలో మరణించినట్టు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.