విజేందర్ డ్రగ్స్ వాడాడు ... పోలీసులు
posted on Apr 1, 2013 8:40AM
ఒలంపిక్ బాక్సింగ్ లో కాంస్య పతాక విజేత విజేందర్ డ్రగ్స్ తీసుకున్నారని డ్రగ్స్ పరీక్ష చేస్తామని పోలీసులు పట్టుబట్టినా విజేందర్ నిరాకరించారు. పంజాబ్ పోలీసులు పట్టువిడవకుండా విజేందర్ ఫోన్ కాల్స్ లిస్టు పై నిఘా పెట్టి నార్కోటిక్ డీలర్, స్మగ్లర్ కెనడాకు చెందిన అనూప్ సింగ్ కహ్లోన్ అలియాస్ రూబీతో విజేందర్ 80 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు కాల్ రికార్డుల్లో తేలిందని ఆదివారం పోలీసులు వెల్లడించారు. విజేందర్ స్నేహితుడు రాంసింగ్ లకు రూబీతో చాలాకాలం నుంచి పరిచయం ఉందని, విజేందర్, రూబీ మధ్య ఎస్.ఎం.ఎస్.ల రాయబారం కూడా నడిచిందని, రాంసింగ్ ఐదు సార్లు డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులు తేల్చారు. ఫోన్ కాల్ లిస్టు, ఎస్.ఎం.ఎస్. ల ఆధారంగా విజేందర్ వెంట్రుక, రక్తం పరీక్షలకు కోర్టు నుంచి అనుమతి పొందాలని లూథియానా రేంజ్ డిఐజి ఫరూఖీ తెలిపారు. పోలీసుల విచారణలో విజేందర్ 12 సార్లు డ్రగ్స్ వాడాడని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.