Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీలో బొత్స సినిమా అయిపోయిందా?
posted on: Jul 6, 2026 11:15AM
.webp)
వైసీపీలో బొత్సకు ప్రాధాన్యత తగ్గిపోయిందా? ఆ పార్టీ అధినేత జగన్.. బొత్సను పక్కన పెట్టేశారా? త్వరలో ఆయనకు శాసనమండలిలో ప్రతిపక్ష నేతా హోదా నుంచి ఉద్వాసన చెప్పేస్తారా? అన్న ప్రశ్నలకు వైసీపీ వర్గాల నుంచే ఔనన్న సమాధానం వస్తోంది. ఇందుకు వారు పార్టీ పరంగా ఆయనకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదన్న విషయాన్ని రుజువుగా చూపుతున్నారు. ఇటీవల తరచుగా బొత్స అనారోగ్యానికి గురి కావడం వల్లనే జగన్ ఆయనకు విశ్రాంతి ఇవ్వాలనీ, పెద్దగా ఒత్తడి ఉండకూడదన్న ఉద్దేశంతోనే మండలిలో ప్రతిపక్ష నేత హోదానుంచి తప్పించాలని భావిస్తున్నారనీ అంటున్నారు.
అయితే పరిశీలకులు మాత్రం.. ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే..బొత్సను జగన్ పక్కన పెట్టడానికి ప్రధాన కారణం, ఆయన గతంలోలా యాక్టివ్ గా లేకపోవడం అంటున్నారు. అలాగే ఇటీవలి కాలంలో ఆయన జగన్ తో పెద్దగా భేటీ అయినట్లు కనిపించకపోవడాన్ని చెబుతున్నారు. అన్నిటికీ మించి బొత్సకు రాజకీయంగా గతంలో ఉన్న పట్టు సడలిందని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీటన్నిటికీ మించి విజయనగరం జిల్లా వైసీపీ కార్యాలయం స్థలం విషయంలో ఇటీవల తలెత్తిన వివాదం బొత్సకు ఉద్వాసన పలకాలన్న నిర్ణయానికి జగన్ రావడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
పూసపాటి రాజవంశీయుల భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 33 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం జరిగింది. దీనిపై గోవాగవర్నర్ అశోక్ గజపతిరాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అది ప్రైవేటు భూమి అని తేలితే.. కార్యాలయ భవనాన్ని వైసీపీ వదులుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. వైసీపీ ఇమేజి భారీగా డ్యామేజ్ అవుతుంది. ఈ విషయంలోనే జగన్ బొత్సపై తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారనీ, అప్పట్లో మంత్రి స్థానంలో ఉన్న బొత్స నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడీ వివాదం తలెత్తిందని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
Botsa, sidelined, YCP, Ysjagan, Vijayanagaram, YCP Office, Land Dispute, Inactive





