Latest News

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు 

posted on: Jan 30, 2025 1:06PM

శంషాబాద్ ఎయిర్​పోర్ట్​కు  గుర్తు తెలియని వ్యక్తులు  గురువారం బాంబు బెదిరింపు కాల్ చేశారు. అప్రమత్తమైన భధ్రతా సిబ్బంది  తనిఖీలు చేశారు. ఇది బూటకపు కాల్ అని వారు తేల్చారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిజామాబాద్ వాసి అని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.   మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి ఈ కాల్ చేసినట్టు వెల్లడైంది. బాంబు లేదని కన్ఫర్మ్ చేసుకున్న భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.   
 

google-ad-img
    Related Sigment News
    • Loading...