టెన్షన్ టెన్షన్.. లక్నోలో బాంబు పేలుడు

posted on: Feb 13, 2020 12:20PM

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో గురువారం ఉదయం బాంబు పేలుడు చోటు చేసుకొంది. కోర్టు వద్ద జరిగిన ఈ ఘటనలో పలువురు లాయర్లు గాయపడ్డారు. కోర్టు ఆవరణలో మరో మూడు బాంబులను కనుగొన్న పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. బాంబు పేలుడుతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. పరిసర ప్రాంతాల్లో ఇంకేమైనా బాంబులు ఉన్నాయా అన్న అనుమానంతో బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...