చెన్నై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

 

ఈమధ్యకాలంలో దేశంలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు ఎక్కువైపోయాయి. తాజాగా చెన్నై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టామని, కొద్దిసేపట్లో అది పేలబోతోందని ఒక ఫోన్ కాల్ విమానాశ్రయ అధికారులకు వచ్చింది. దాంతో విమానాశ్రయ సిబ్బంది, బాంబు స్క్వాడ్ తనిఖీ సిబ్బంది విమానాశ్రయం మొత్తాన్నీ గాలించి వదిలిపెట్టారు. బాంబు స్క్వాడ్ హడావిడి చూసి ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. చివరికి అది ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్ అని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివర్లో ట్విస్ట్ ఏమిటంటే, బెదిరింపు కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు.