బొగ్గుల శ్రీనివాస్ మృతిపై వీడిన మిస్టరీ

posted on: Feb 22, 2026 2:12PM

 

యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతిపై మిస్టరీ విడింది. ఆర్థిక లావాదేవీలతోనే హత్య చేయించినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు. ఆయనను మాధవరెడ్డి సుఫారీ గ్యాంగ్‌తో చేయించినట్లు ఏసీపీ వెల్లడించారు.  శ్రీనివాస్ జీఎస్టీ పర్మిషన్‌ను మాధవరెడ్డి వాడుకుని డబ్బులు చెల్లించలేదు. 

దీంతో ఆయన ఒత్తిడి చేయడంతో నార్కెట్‌పల్లి వద్ద మర్డర్ చేసి కారుతో సహా పాలేరు రిజర్వాయర్‌లో శ్రీనివాస్ మృతదేహాన్ని పడేసి కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితుల ప్రయత్నించారు. ప్రధాన నిందితుడు వేణుమాధవ రెడ్డి సహా నలుగురిని కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బొగ్గుల శ్రీనివాస్ రాసిన పుస్తకానికి, హత్యకు ఎలాంటి సంబంధం లేదని  ఏసీపీ తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు
 

google-ad-img
    Related Sigment News
    • Loading...