ప్రస్తుతానికి సెక్షన్ 8 అవసరం లేదు.. కిషన్ రెడ్డి

posted on: Jun 25, 2015 5:36PM

ఇప్పటికే ఓటుకు నోటు కేసు గురించి ఒక్కో నేత ఒక్కో రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు విషయంలో తమకు సంబంధం లేదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లో సెక్షన్‌-8 అవసరంలేదని.. సెక్షన్ 8 అమలు చేయడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు. ఇది టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య సమస్య అని దీనిని ప్రాంతీయ సమస్యగా మార్చొద్దని రెండు రాష్ర్టాల ప్రభుత్వాలను కోరుకుంటున్నానని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...