ప్రస్తుతానికి సెక్షన్ 8 అవసరం లేదు.. కిషన్ రెడ్డి

ఇప్పటికే ఓటుకు నోటు కేసు గురించి ఒక్కో నేత ఒక్కో రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు విషయంలో తమకు సంబంధం లేదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లో సెక్షన్‌-8 అవసరంలేదని.. సెక్షన్ 8 అమలు చేయడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు. ఇది టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య సమస్య అని దీనిని ప్రాంతీయ సమస్యగా మార్చొద్దని రెండు రాష్ర్టాల ప్రభుత్వాలను కోరుకుంటున్నానని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu