అంతర్జాతీయ యోగా దినోత్సవంపై మరో వివాదం...

 

ఇప్పటికే మత పరమైన విద్వేషాలు రగలడానికి.. వివాదాలు తలెత్తడానికి బీజేపీ కారణమంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు యోగాపై కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ఓం, వేదమంత్రాలను చదవాలంటూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ హిందుత్వ ఎజెండాను తెరపైకి తీసుకువస్తున్నదంటూ కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేసీ త్యాగి(జనతాదళ్ యు), సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్) వంటి పలువురు నాయకులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కు ముందు ఓం, కొన్ని వేద మంత్రాలను చదవాలంటూ బీజేపీ సర్కార్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. దీంతో మరో వివాదం తెరపైకి  వచ్చింది. మొత్తానికి బీజేపీ కావాలని చేస్తుందో.. లేక యాదృచ్ఛికంగా జరుగుతుందో తెలియదు కానీ మతపరమైన వివాదాల్లో మాత్రం ఎప్పుడూ చిక్కుకుంటూనే ఉంటుంది.