ప్రజలపై నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం... అమిత్ షా

భాజపా అధ్యక్షుడు అమిత్ షా నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని కొనియాడారు. ఢిల్లీలోని భాజపా కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం ఉండేది కాదని, కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ప్రజలపై నమ్మకాన్ని నిలబెట్టుకుందని అన్నారు. భారత్ అభివృద్ధి చెందుతున్న విధానం పై ప్రపంచం చాలా ఆసక్తికరంగా చూస్తుందని, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.