Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పల్నాడు జిల్లాలో బర్డ్ ప్లూ కలకలం.. రెండేళ్ల చిన్నారి మృతి
posted on: Apr 2, 2025 11:47AM
పల్నాడు జిల్లా నరసారావుపేటలో బర్డ్ ప్లూ కలకలం రేపింది. మంగళగిరి ఎయి మ్స్ ఆస్పత్రిలో గత నెల 16 వ తేదీన రెండేళ్ల చనిపోవడంతో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైద్యుల బృందం కుటుంబ సభ్యులకు రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో అమ్మాయి చనిపోవడానికి బర్డ్ ప్లూ కారణమని వైద్యులు తేల్చారు. గత నెలలో ఎపిలో బర్డ్ ప్లూ విజృంభించింది. ఫిబ్రవరి 28వ తేదీన బాధిత కుటుంబం వండటానికి కోడిమాంసం తెచ్చుకుంది. వండే ముందు పచ్చిమాంసం ముక్క ఒకటి చిన్నారికి ఇచ్చి తినిపించింది. సహజంగా చిన్నారుల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటంతో చికెన్ ముక్క తిన్న వెంటనే చిన్నారి శరీరంలో బర్డ్ ప్లూ వైరస్ ప్రవేశించింది. వైరస్ సోకగానే చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చేర్చినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. పక్షం రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన చిన్నారి మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కోడిమాంసం విక్రయాలను నిషేధించింది. 100 డిగ్రీల టెంపరేచర్ లో కోడిమాంసం ఉడికించి తింటే బర్డ్ ప్లూ వచ్చే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు.



.webp)


