TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో బర్డ్ ప్లూ కలకలం.. వనపర్తి జిల్లాలో వేలాది కోళ్లు మృత్యువాత 

Published on: Wed Feb 19, 2025 11:34AM

ఎపిలో బర్డ్ ఫ్లూ సోకి  కోళ్లు చనిపోతున్నాయి. తాజాగా తెలంగాణలో కూడా బర్డ్ ప్లూ విస్తరించినట్లు వార్తలందుతున్నాయి. వనపర్తి జిల్లాలోని కోళ్ల ఫారాల్లో వేలాది కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు చనిపోతున్నాయని రైతులు చెబుతుంటే వెటర్నరీ అధికారులు  మాత్రం ఇంత వరకు ధృవీకరించలేదు. చనిపోయిన కోళ్లను జెసీబీ మిషన్లతో గొయ్యి తవ్వి పూడ్చేస్తున్నారు. వనపర్తి జిల్లాకు చెందిన రైతు శివకేశవరెడ్డి వెటర్నరీ అధికారులకు ముందుగానే సమాచారమిచ్చినప్పటికీ అధికారులు స్పందించలేదు. దీంతో  ఆయనకు చెందిన నాలుగు వేళ్ల కోళ్లు మృత్యువాత పడ్డాయి